రేపట్నుంచి విశాఖ విమానాశ్రయంలో టూరిస్ట్ వీసా ఆన్ ఎరైవల్ సదుపాయం అందుబాటులో ఉంటుందని మంత్రి అఖిలప్రియ అన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ… విశాఖ విమానాశ్రయంలో ఈ-వీసాకు కేంద్రం పచ్చజెండా ఊపిందన్నారు. ఈ-వీసాతో విదేశీ పర్యాటకులు ఇక నేరుగా విశాఖ చేరుకోవచ్చన్నారు. ఈ-వీసాతో రాష్ట్రంలో పర్యాటకానికి కొత్త ఊపు వచ్చిందన్నారు. దేశంలోని 16 విమానాశ్రయాలకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుందన్నారు. టూరిస్ట్ వీసా ఆన్ ఎరైవల్ సదుపాయం కల్పించిన కేంద్రానికి మంత్రి కృతజ్నతలు తెలిపారు.