పాట్నా : ఈ సారి కూడా గుజరాత్ బీజేపీదే అని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన విషయం విదితమే. ఈ ఎగ్జిట్ పోల్స్పై బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు. గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు ఒకసారి బీహార్ ఎగ్జిట్ పోల్స్ అందరూ గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. 2015, నవంబర్లో బీహార్ శాసనసభ(243 స్థానాలు)కు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కూడా బీహార్లో బీజేపీదే విజయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. మహాకూటమి(జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్) విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేసిన తేజస్వి యాదవ్.. ఇప్పుడు కూడా గుజరాత్, హిమాచల్ప్రదేశ్లో అదే పరిస్థితి ఉంటుందన్నారు. నాటి ఎగ్జిట్ పోల్స్ను తేజస్వియాదవ్ ట్వీట్ చేశారు.