ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయం జరుగుతుందని ఫాతిమా విద్యార్థులకు పవన్ హామీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2017, 11:12 AM

విజయవాడ : మీకు న్యాయం జరుగుతుంది మీరు మళ్లీ కాలేజీలకు వెళతారు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫాతిమా విద్యార్థులకు హామీ ఇచ్చారు. జరిగిన విషయంలో విద్యార్థుల తప్పు ఇసుమంతైనా లేదని పవన్ అన్నారు. ఆరోగ్యమంత్రితో మాట్లాడతానన్నారు. వేల కోట్ల రూపాయలు ఒక్క సారిగా వ్యవస్థలోంచి తీసేయడానికి వీలు ఉన్నప్పుడు వంద మంది విద్యార్థులకు న్యాయ చేయడానికి అవకాశం ఎందుకు ఉండదని పవన్ కల్యాణ్ అన్నారు. కాలేజీ యాజమాన్యం తప్పుకు విద్యార్థులను శిక్షించడమేమిటని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాను బాధితుల తరఫున పోరాడుతానన్నారు. ఇక్కడ ఉన్న విద్యార్థులెవరూ తన బంధువులు కాదన్నారు. ఇది చాలా తీవ్రమైన సమస్య అన్న పవన్ కల్యాణ్…దీనిపై పెద్ద మాటలు చెప్పి రాజకీయ ప్రదర్శన చేయదలచుకోలేదన్నారు. మీకు న్యాయం చేయడానికి చివరి వరకూ పోరాడతానన్నారు. తాను అవసరమైన అందరితోనూ మర్యాదగానే మాట్లాడతానని పవన్ కల్యాణ్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com