ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను అధిగమించామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని, 7గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నారని అన్నారు. గత మూడేళ్లలో విద్యుత్ సామర్థాన్ని రెట్టింపు చేశారన్నారు. విద్యుత్ లోటు నుంచి సర్క్యులేషన్ వరకు తీసుకెళ్లారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో 16 అవార్డులు రావడం చాలా సంతోషకరమన్నారు.