అమరావతి: జీవితంలో అన్నింటికంటే విద్యార్థి జీవితం ముఖ్యమైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిలోని ఐనవోలు గ్రామంలో విట్ ఏపీ క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. విద్యలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముందున్నారన్నారు. ప్రపంచంలోని ఐటీ కంపెనీల్లో మనవాళ్లు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లినవారిలో సత్య నాదెళ్ల ఉన్నారన్నారు.