జగన్ చేసేది పాదయాత్ర కాదు… విహారయాత్ర అని టీడీపీ మంత్రి జవహర్ విమర్శించారు. వారానికి ఒకరోజు కోర్టు చుట్టూ తిరిగే వ్యక్తి పాదయాత్ర చేయడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం కోర్టు కేసుల నుంచి తప్పించుకోవడానికే పాదయాత్ర చేస్తున్నాడని తెలిపారు. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి ప్రతిపక్ష పాత్ర కూడా దక్కదని ఆయన వ్యాఖ్యానించారు.