ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు ప్రస్తుతం వేడిగా సాగుతున్నాయి. టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు. ఫైబర్ గ్రిడ్ టెండర్లలో 5 కంపెనీలు పాల్గొన్నాయి. టెండర్లు వేయడానికి ఒక రోజు ముందు టెరాసాఫ్ట్ కంపెనీని బ్లాక్లిస్ట్ నుంచి తొలగించారు అని మంత్రి బాలినేని తెలపగా ఫైబర్ గ్రిడ్.. స్పైవేర్ స్కాంలకు తల్లివేరు లాంటిది. బాబు పాలనలో జరిగిన ఈ టెండర్లలో భారీగా అవకతవకలు జరిగాయి. నిబంధనలు పాటించకుండా ఫైబర్గ్రిడ్ను టెర్రాస్ కంపెనీకి అప్పగించారు అని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తెలిపారు. సభలో నిబంధనలు పాటించకుండా సభలో టీడీపీ సభ్యులు హద్దులు దాటి విజిల్స్, కేకలు వేయడం దారుణం. అసెంబ్లీ రూల్స్కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలి. మాట్లాడే అవకాశం రాకపోతే విజిల్స్ వేస్తారా..? ఆయుధాలు తీసుకువస్తారా..? అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు.