వినుకొండ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలు వెలికితీయాలని వినుకొండ పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు కొమ్మిరెడ్డి శివారెడ్డి లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని కొత్తపేట ఆరెంజ్ స్టోర్ వద్ద అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ సెల్లార్ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పందనలు ఫిర్యాదు చేశానన్నారు. అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించిన వినుకొండ మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరొకమారు స్పందనలు ఫిర్యాదు చేశామన్నారు. ఉన్నతాధికారుల నుండి స్పందన లేకపోవడంతో వినుకొండ మున్సిపాలిటీలో జరుగుతున్న పలు అక్రమాలు అవినీతి పై కొమిరెడ్డి శివారెడ్డి లోకాయుక్తలో కేసు వేయడం జరిగిందని తెలిపారు.