గుజరాత్ లో ప్రధాని మోడీ మరోసారి పర్యటించనున్నారు. ఆదివారం ఆయన గుజరాత్ లోని భావ్నగర్, వడోదర జిల్లాల్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నెలలో ఇప్పటికే రెండు సార్లు ప్రధాని గుజరాత్లో పర్యటించారు. భావ్నగర్ జిల్లాలోని ఘోఘా, భరూచ్ జిల్లాలోని దహేజ్ల మధ్య రోల్–ఆన్ రోల్–ఆఫ్ ఫెర్రీసేవల్ని ప్రారంభిస్తారు. ఘోఘాలో ప్రసంగించిన అనంతరం.. దహేజ్ నుంచి ఘోఘా వరకూ ఫెర్రీలో ప్రయాణిస్తారు. అనంతరం దహేజ్ నుంచి వడోదర వెళ్తారు. అక్కడ 11 వందల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఐతే గుజరాత్ ఎన్నికలకు ఈసీ ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకటించకపోవటంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ప్రధాని మోడీయే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారేమోనని సెటైర్ వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం.