ఓ మైనర్పై అత్యాచారం కేసులో మేఘాలయ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మహిళ జననేంద్రియాలను లోదుస్తులపై నుంచి పురుషాంగంతో తాకినా అత్యాచారంగానే పరిగణించాలని స్పష్టం చేసింది. 'మహిళ యోని లేదా మూత్రనాళంలోకి ఏదైనా చొప్పించడం శిక్షా స్మృతిలోని సెక్షన్ 375(బి) ప్రకారం అత్యాచారమే' నని మేఘాలయ హైకోర్టు తెలిపింది.
2006లో పదేళ్ల బాలిక తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టు 2018లో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది. అప్పుడు నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. కానీ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. తన వాదనను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను అత్యాచారం చేయలేదని చెప్పాడు. లోదుస్తుల పై నుంచి పురుషాంగంతో తాకానని తెలిపాడు. వైద్య పరీక్షలు, నిందితుడు, బాధితురాలి వాంగ్మూలం పరిగణనలోకి తీసుకొని ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. నిందితుడు శిక్షార్హుడేనని పేర్కొంది.