గుంటూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం మళ్ళీ వెలుగులోకి వచ్చిoది. గుంటూరు వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం పీజీ చదువుతున్న విద్యార్థులను సీనియర్ విద్యార్థులు పొడుగు చొక్కాలు వేసుకోవాలంటూ వేధిస్తున్నట్లు, గురువారం నేషనల్ మెడికల్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారు. జూనియర్ పీజీ విద్యార్థుల ఫిర్యాదు మేరకు స్పందించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ శుక్రవారం జియంసి ప్రిన్సిపాల్ ఆచార్య పద్మావతి విచారణ చేసి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.