కుష్టు వ్యాధిని సకాలంలో గుర్తించి మందులు వాడితే తగ్గిపోగలదని కురబలకోట మండల వైద్యాధికారి శ్రీధర్ తెలిపారు. ఆయన స్థానిక పీహెచ్సీలో మాట్లాడుతూ కుష్టు వ్యాధి కలిగిన వారు భయపడకుండా మనోధైర్యం వహించాలన్నారు. డాట్ పద్ధతిలో క్రమంగా మందులు వాడితే తగ్గిపోతుందన్నారు. దీనిని గుర్తించడం కూడా సులభం ఉన్నారు. బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, రెండు వారాలకు మించి దగ్గు ఉండటం లాంటి లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోవాలన్నారు. దీని నివారణకు ఉచిత మందులు ఉన్నాయన్నారు. ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలన్నారు.