గడివేముల తహశీల్దార్ కార్యాలయంలో గురువారం నాడు మండలంలోని అన్ని గ్రామాల విఆర్ఓ లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ నాగమణి మాట్లాడుతూ గ్రామాల్లోని పెండింగ్లో ఉన్న రెవిన్యూ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. స్పందన లో వచ్చే అర్జీలను పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నారు. గడివేముల మండలంలో 29 ఈ పాస్ బుక్ లు వచ్చాయని వీఆర్వో వద్దకు వెళ్లి ఈ పాసుబుక్లను లబ్ధిదారులు తీసుకోవలన్నారు. ఈ కార్యక్రమం లో డీటీ శుభకర్ మండలంలోని అన్ని గ్రామాల వీఆర్వో లు పాల్గొన్నారు.