ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 11:22 AM

గడివేముల తహశీల్దార్ కార్యాలయంలో గురువారం నాడు మండలంలోని అన్ని గ్రామాల విఆర్ఓ లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ నాగమణి మాట్లాడుతూ గ్రామాల్లోని పెండింగ్లో ఉన్న రెవిన్యూ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. స్పందన లో వచ్చే అర్జీలను పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నారు. గడివేముల మండలంలో 29 ఈ పాస్ బుక్ లు వచ్చాయని వీఆర్వో వద్దకు వెళ్లి ఈ పాసుబుక్లను లబ్ధిదారులు తీసుకోవలన్నారు. ఈ కార్యక్రమం లో డీటీ శుభకర్ మండలంలోని అన్ని గ్రామాల వీఆర్వో లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com