పంజాబ్లోని భదౌర్ నియోజకవర్గంలో సీఎం ఛన్నీని లభ్ సింగ్ యుగోకే ఓడించాడు. అతడు ఒక చిన్న మొబైల్ రిపేర్ షాపులో పనిచేస్తాడు. లభ్ సింగ్ తల్లి ప్రభుత్వ స్కూల్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. అతడి తండ్రి వ్యవసాయ కూలీ. తల్లి చీపురును పట్టుకొని స్కూల్లో చెత్తను ఊడ్చితే.. ఆమె కుమారుడు అమ్ ఆద్మీ చీపురు పట్టుకొని రాజకీయాలను ఊడ్చేశాడు. ఏకంగా సీఎంనే ఓడించాడు.