గర్భిణీలు, బాలింతలు పౌష్టకాహారాన్ని పంపిణీ చేయాలని ఎంపీపీ గోకుల్ లక్ష్మీ అన్నారు. ప్యాపిలి మండల పరిధిలోని పోతు దొడ్డి గ్రామం లోని అంగన్వాడి కేంద్రాన్ని ఎంపీపీ గోకుల్ లక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేసి సరుకుల నాణ్యతలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.అంగన్వాడీ కేంద్రాల నుంచి గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని అంగన్వాడి నిర్వాహకులకు తెలిపారు. గర్భిణీలు, బాలింతలు పౌష్టకాహారాన్ని తీసుకోవాలని, కేంద్రంలో గుడ్లు, పప్పు, నూనె పదార్థాలు, పౌష్టికాహార పైన సూచించారు.