కోల్కతా : పశ్చిమబెంగాల్లోని నయగ్రామ్లో రోడ్డుప్రమాదం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. జార్గ్రామ్లో సీఎం మమతా బెనర్జీ బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.