రైతుల బాధలను చూసి సీఎం చంద్రబాబు చలించిపోయారు. రైతుల కష్టాలు తనకు తెలుసని, తాను రైతు కుటుంబం నుంచే వచ్చానని చెప్పారు. హరిత విప్లవం వచ్చినా రైతుల ఇబ్బందులు తగ్గలేదని చంద్రబాబు అన్నారు. సోమవారం జూపాడు బంగ్లా మండలం తంగడంచలో మెగాసీడ్ పార్క్కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాసిరకం విత్తనాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత పాలకులు నాసిరకం విత్తనాలు పంపిణీ చేశారని ఆయన ఆరోపించారు. పోలీస్స్టేషన్కు వెళ్లి విత్తనాలు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. రైతుల కష్టాలు తీర్చేందుకే రైతు రుణమాఫీ చేశాం. ఇప్పటి వరకు రైతులకు 14,200 కోట్ల రుణమాఫీ నిధులు ఇచ్చాం. తంగడంచ రైతులకు రూ. 2.30 కోట్ల రుణాలు మాఫీ చేశాం అని చంద్రబాబు చెప్పారు.