దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించింది నందమూరి తారకరామారావుఅని నారాబ్రాహ్మిణి అన్నారు. బుధవారం శ్రీసత్యసాయిజిల్లా హిందూపురంలోని జేవీఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన స్త్రీశక్తి మహిళా ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి నందమూరి వసుందరదేవితోపాటు, నారా బ్రాహ్మిణి, తేజశ్వినిలు హాజరై మాట్లాడుతూ మహిళా సాధికారతే చంద్రబాబు లక్ష్యమని ఎన్నికల చంద్రబాబును గెలిపించాలన్నారు.