న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సందర్శనకు వచ్చే సందర్శకులకు, పర్యాటకులకు రేపు ఎర్రకోట సందర్శన బంద్. దసరా మహోత్సవాల నిర్వహణే ఇందుకు కారణం. ఎర్రకోట బయట నిర్వహించే దసరా ఉత్సవాల్లో వీవీఐపీలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అదేవిధంగా రెడ్ ఫోర్ట్ లోపల నిర్వహించే సౌండ్, లైట్ షోలు సైతం బంద్ కానున్నాయి.