కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.103.50 పెంచారు. పెరిగిన ధర నేటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధర రూ.2,104 కి చేరింది. ఇంతకు ముందు రూ.2000.50గా ఉంది. అయితే పెట్రోలియం కంపెనీలు గృహవినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధర పెంచకపోవడం ఉపశమనాన్ని కలిగించింది. ఢిల్లీలో సబ్సిడీ లేని 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 899.50 కాగా, కొత్త 5 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.502గా ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ధరలను సమీక్షిస్తుంటాయన్న విషయం తెలిసిందే.