ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదివాసీ దినోత్సవాలను ప్రారంభించిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2017, 02:37 PM

అరకులోయలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా  ఆదివాసీ గిరిజన యువతులతో కలసి డ్యాన్స్ చేస్తూ సేదదీరారు. వారు తమ సంప్రదాయ థింసా నృత్యం చేస్తుంటే, వారి చేతులు పట్టుకుని చంద్రబాబు కూడా కాసేపు నృత్యం చేశారు. ఆయనతో పాటు గవర్నర్ నరసింహన్ సైతం చేరిపోయారు. ఇక్కడి గిరిజనులు తయారు చేసే ఆహార ఉత్పత్తులను పరిచయం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అరకు లోయ తనకెంతో ఇష్టమైన ప్రదేశమని, ఇక్కడి గాలి స్వచ్ఛమైనదని అన్నారు. అంతకుముందు ఆదివాసీ దినోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఇక్కడి అందాలు గవర్నర్ నరసింహన్ కు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించాయని తెలిపారు. అరకు ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి వున్నానని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com