టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ల ఆట ప్రారంభమయ్యింది. తొలిరోజు ఆర్చరీ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్ రౌండ్ లో భారత ఆర్చర్ దీపికా కుమారి 9వ స్థానంలో నిలిచింది. వ్యక్తిగత ర్యాకింగ్స్ లో 72 బాణాలు సంధించిన దీపికా.. మొత్తం 663 స్కోరు సాధించింది. తొలి 3 స్థానాల్లో దక్షిణ కొరియా ఆర్చర్లు నిలిచారు. దక్షిణ కొరియా క్రీడాకారిణి ఆన్ సాన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆమె 680 స్కోరు సాధించింది. గతంలో తన పేరిటే ఉన్న రికార్డును ఆమె అధిగమించింది. గత ఒలింపిక్స్ లో సాన్ 673 స్కోర్ రికార్డు చేసింది. ఆమె తర్వాత 677 స్కోర్ తో జంగ్ మిన్హే, 675 స్కోర్తో చయంగ్ కాంగ్ తర్వాతి 2 స్థానాల్లో నిలిచారు.