ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్

national |  Suryaa Desk  | Published : Wed, Jul 14, 2021, 12:43 PM

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యాల కేరళలో రెండు రోజుల పాట సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జులై 17 శనివారం, జులై 18 ఆదివారం లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కేరళలోని ప్రాంతాలను టెస్ట్ పాజిటివిటీ రేటు (TPR) ఆధారంగా 4 కేటగిరీలుగా విభజించారు. TPR 5 లోపు ఉంటే కేటగిరీ-A, టీపీఆర్ 5 నుంచి 10 మధ్య ఉంటే కేటగిరీ-B, టీపీఆర్ 10-15 మధ్య ఉంటే ఉంటే కేటగిరీ-C, టీపీఆర్ 15పైన ఉంటే కేటగిరీ-Dగా వర్గీకరించారు. కేటగిరీ ఏ, బీ, సీ ప్రాంతాల్లో అన్ని షాపులను రాత్రి 8 వరకు తెరిచి ఉంచవచ్చు. ఆ తర్వాత ఏ దుకాణమూ తెరవడానికి వీల్లేదు. ఇక కేటగిరి-డీ ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అక్కడ కేవలం నిత్యావసర వస్తువులను అమ్మే షాపులు మాత్రమే ఓపెన్ ఉంటాయి. ఐతే కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. శని, ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆ రెండు కేవలం నిత్యావసర సరుకులను విక్రయించే దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయి. ప్రస్తుతం మనదేశంలో కేరళలోనే ఎక్కువ మంది కోవిడ్ బారినపడుతున్నారు. కేరళలో నిన్న 14,539 మంది కరోనా బారినపడ్డారు. 10,331 మంది కోలుకోగా..124 మంది చనిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com