దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ కొద్దిసేపటి కిందట విడుదల చేసిన బులిటెన్ మేరకు గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 86,961 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 54,87,581కు చేరింది. అలాగే కరోనా కాటుకు గత 24 గంటల్లో 1130 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 87,882కు పెరిగింది.