ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రై ఫ్రూట్స్ తో తిరుమలేశునికి ఆభరణాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 21, 2020, 10:36 AM

తిరుమల –   అలంకారప్రియుడైన తిరుమలేశుడికి వేలకట్టేలేని వజ్రావైడుర్యాలు పొదిగిన అభరణాలే కాదు ప్రపంచంలో మరె దేవతమూర్తులకు లేనివిధంగా డ్రైఫ్రూట్స్ అలంకరణలు కూడా ఆయనకే సొంతం ఉత్సవమూర్తులకు జీయంగార్ల సమక్షంలో ఆలయ అర్చకులు స్నపన తిరుమంజనం అని పిలువబడే అభిషేక కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతుంది. అరుదైన పుష్పాలు, తాజా పండ్లతోనే కాకుండా ఈ సారి డ్రై ఫ్రూట్స్ తో మాలలు, కిరీటాలు, జడలను తయారు చేయించారు. వీటిలో బాదంపప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, మేలురకమైన కజ్జురం, ఎండు కజ్జురం, పిస్తా, గుమ్మడికాయ గింజలు, యలకులతో పాటు ముత్యాలు, పూసలు, వట్టివేరు, పెటల్స్, విదేశీ కట్ ఫ్లవర్స్ ని వినియోగించారు. వీటిని తమిళనాడు రాష్ట్రం తిరుపూరుకి చెందిన భక్త బృందం దాదాపు 40 రోజులు పాటు స్వామివారిపై భక్తితో నిష్టగా తయారుచేసారు టీటీడీకి విరాళంగా అందజేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com