చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పలమనేరు మండలం టీ వడ్డురు గ్రామం వద్ద గుడియాతం రోడ్డుపై సోమవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారులు భాస్కర్ (46) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై ప్రియాంక సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.