అనంతపురం జిల్లాలో పీఏబీఆర్ డైవర్షన్ కాలువ షట్టర్, వంతెన కూలిపోయింది. తుంగభద్ర ఎగువ కాలువ అయిన హెచ్చెల్సీ నుంచి 800 క్యూసెక్కుల నీరు వస్తోంది. అయితే ఉరవకొండ మండలం మోపిడి వద్ద పీఏబీఆర్ డైవర్షన్ కాలువ షట్టర్, వంతెన కూలిపోయింది. ప్రస్తుతం ఈ కాలువ మీదుగా అధికారికంగా 470 క్యూసెక్కుల నీరు వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రవాహం ఉండటంతో కాలువ సామర్థ్యం పై సందేహాలు నెలకొన్నాయి.గతేడాది కాలువ గట్టు తెగడంతో ఇసుక సంచులతో పూడ్చి వేశారు. ఇప్పుడు షట్టర్, వంతెన కూలిపోవడం వలన సుమారు 3వేల ఎకరాల పంట పొలాల్లోకి నీరు వెళ్లేందుకు రైతులకు ఆస్కారం లేకుపోయింది. ప్రస్తుతం ప్రవాహం ఎక్కువ కావడంతో కాలువకు అనుకుని ఉన్న పొలాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మూడేళ్లుగా కాలువ షట్టర్, వంతెన కూలిపోయే పరిస్థితిలో ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు. ఇప్పుడు పూర్తిగా తెగిపోవడం వల్ల కనీసం మనిషి వెళ్లేందుకు ఆస్కారం లేకుండా పోయిందన్నారు.