కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను పీపీఈ కిట్లు ధరించి శ్మశానానికి తీసుకెళ్లి ఖననం చేస్తున్నారు. అయితే అనంతరం వారు ఉపయోగించిన పీపీఈ కిట్లను ప్రజలు తిరిగే పరిసర ప్రాంతాల్లో పడేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఉపయోగించిన పీపీఈ కిట్లను రహదారికి పక్కనే పడేస్తుండటంతో కర్నూలులో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని సుంకేసుల రోడ్డువైపు శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇటీవల కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను శ్మశాన వాటికలకు తీసుకొస్తున్నారు. బంధువులు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత ఆ పీపీఈ కిట్లను సమీపంలో రహదారుల వెంట పడేస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోలన చెందుతున్నారు. వాడిన పీపీఈ కిట్లను ఇలా పారవేయడంపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.