ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తుని మండలం సీతారాంపురం దగ్గర రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ వైపు వెళ్తున్న కొల్లు రవీంద్రను మఫ్టీలో వెళ్లిన కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు రవీంద్రను తుని నుంచి విజయవాడకు తరలించారు. మచిలీపట్నంలో మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ను అరెస్టు చేశారు.ఇంతకు ముందు భాస్కర్ రావు హత్య కేసులో విచారణ నిమిత్తం రవీంద్ర ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. భాస్కర్ రావును మచిలీపట్నం మార్కెట్ యార్డ్ సమీపంలో కొందరు దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందని పోలీసులు ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. రవీంద్ర అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రభత్వ కక్ష సాధింపు చర్యలకు ఈ అరెస్టు నిదర్శనమన్నారు. ఎమర్జెన్సీలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదన్నారు.