సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కంటి వెలుగు 3వ దశను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది అవ్వాతాతలకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో విడత కింద కంటి పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచితంగా కంటి పరీక్షలు, కంటి ఆద్దాలను ఇవ్వడమే కాకుండా, అవసరమైన వారికి ప్రభుత్వమే ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించనుంది.