ఏపీలో పలు మున్సిపల్ కార్యాలయాలపై ఏసీబీ తనిఖీలు చేసింది. విశాఖ, విజయనగరం, ప్రకాశం జిల్లాలో ఏసీబీ తనిఖీలు చేసింది. విశాఖ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. మధురవాడ జీవీఎంసీ జోన్ వన్ ఆఫిస్ లో ఏసీబీ దాడులు నిర్వహించింది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ లో ఏసీబీ దాడులు చేసింది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆపీసులో సోదాలు చేసింది. వరుస ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.