అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : పార్టీలో క్రమ శిక్షణ ఉల్లంఘిస్తే ఇక వేటు వేస్తామని, కనీసం విచారణ కూడా జరపమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ మంత్రులు, ముఖ్యనేతలతో చంద్రబాబు నాయుడు నేడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఇటీవల కాలంలో పార్టీలో చోటు చేసుకున్న క్రమ శిక్షణా రాహిత్య ఘటనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సత్వరం చర్యలు తీసుకుంటా మన్నారు. ప్రకాశం జిల్లాలో ఘటనపై కమిటీ వేస్తామ న్నారు. కర్నూలు హత్యల్లో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకె ళ్లాలని తెలిపారు. హత్యలు జరగటం దురదృష్టకరమని, దానికి తెలుగుదేశం పార్టీని తప్పుపడితే ఎలా అని ప్రశ్నిం చారు. భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా ఉన్నా మని, ఉండబోతున్నామని తెలిపారు. నేతలు మిత్రధ ర్మాన్ని పాటించాల్సిందేనన్నారు. పార్టీ నేతలు తెలుగు దేశం పార్టీని విమర్శిస్తే వారి అధిష్ఠానం చూసుకుంటుం దని చెప్పారు. ఎన్నికలకు ముందే మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, పొత్తు ధర్మాన్ని అందరూ పాటించాల న్నారు. పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూ డదన్నారు. అలాగే కర్నూలు జిల్లా పత్తికొండ హత్యల్లో వాస్తవాలు ప్రజలకు చెబుతామని, గత చరిత్రే వారిని వెం టాడుతుందని చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి వివాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ సంఘానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. అం తేగాక ప్రకాశం జిల్లా టీడీపీ ఆఫీస్లో జరిగిన ఘటనపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ఆదాయం పెరిగితే ఆనందం ఆదాయం పెరిగితేనే ఆనందం, ఆహ్లాదం వస్తా యని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశుభ్రత ప్రతివ్యక్తి బాధ్య త కావాలని ఆయన ఆకాంక్షించారు. అది మన వారసత్వ సంపద కావాల న్నారు. స్వచ్ఛఆంధ్రప్రదేశ్ పురోగతిపై ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పరిశుభ్రత మన సంస్కృతిలో భాగం కావాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మారితేనే పర్యాటకం పెరుగుతుందన్నారు.
వాటి మధ్య పోటీ పెట్టి అవార్డులు ఇవ్వాలి
అమరావతి: రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలు, ఆసుపత్రులు, థియేటర్లు, ప్రభుత్వ కార్యాలయాల మధ్య పరిశుభ్రతలో పోటిపెట్టి అవార్డులిచ్చి ప్రోత్సహి ంచాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ పురోగతిపై చంద్ర బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రం స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మారితే పర్యా టకం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశుభ్రతతోనే ఆదాయం, ఆనందం, ఆరోగ్యం సాధ్యమని అభిప్రాయపడ్డారు. పరిశుభ్రత ప్రతి వ్యక్తి బాధ్యత కావాలని, మన సంస్కృతిలో భాగం కావాలని బాబు పేర్కొ న్నారు. దేవుడిపై భక్తి ఎలాగో పరిశుభ్రతపై శ్రద్ధ కూడా అలాగే ఉండాలన్నారు. 2018కల్లా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. చెత్తనుంచి సేంద్రియ ఎరువు తయారీ అనేది అద్భుత ప్రక్రియ అని, అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపడితే పరిశుభ్రతతో పాటు పంటల దిగుబడి పెరుగుతుందని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రాన్ని నాలెడ్జహబ్గా తీర్చిదిద్దుతాం
మెరిట్ సాధించిన విద్యార్ధులను చదివించే బాద్యత నాదేనని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.