ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎటా జిల్లాలో మినీ ట్రక్కు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. దాంతో 14 మంది అక్కడికక్కడే చనిపోగా మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అలర్టయిన స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సక్రౌలి నుంచి ఆగ్రా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.