గుంటూరు జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్, గుంటూరు కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడ నుంచే వీరిరువురితో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ఆదేశించారు. అలాగే మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చేందకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.