పెదతాడేపల్లి వాసవి కాలేజీలో కొందరు విద్యార్థులు అదే కాలేజీకి చెందిన ఓ విద్యార్థిని ఒక్కడిని చేసి చితకబాదారు. దాడి దృశ్యాలు సెల్ఫోన్లో చిత్రీకరించగా ఇప్పుడీ దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. కాలేజీ యాజమాన్యం కూడా పట్టించుకోకపోవడంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించాలని చూస్తున్నారు. అయితే క్రికెట్ బెట్టింగ్ డబ్బుల విషయంలో జరిగిన గొడవ కారణంగానే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది.