ఏపీ-తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ సీఎం కెసిఆర్ రేపు ఢిల్లీకి పయనమవుతుండగా ఎల్లుండి ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఇక అదే రోజు ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈమేరకు సీఎంఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రధానికి వివరించనున్న సీఎం రాష్ట్రానికి రావాల్సిన నిధులుపై కూడా విజ్ఞప్తి చేసి రైతు భరోసా పథకానికి ప్రధానిని ఆహ్వానించనున్నారు.