బంటుమిల్లి గ్రామంలోని బి.ఎన్. ఆర్ కాలనీ దగ్గరలో ఉన్న మళ్ళ సూర్య చందర్రావు ఇంటి వద్ద తవ్వకాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజునే పురాతన అమ్మవారి విగ్రహం బయటపడింది. మల్లేశ్వరం గ్రామానికి చెందిన కొండపల్లి అశోక్ కు గత కొంతకాలంగా అమ్మవారు పైకి పూనకంలోకి వచ్చి బంటుమిల్లిలోని మల్లా సూర్య చందర్రావు ఇంటి ఆవరణలో పలానా చోట 9 అడుగులు తవ్వితే ఐదు పడగలతో పులిపై కూర్చున్న అమ్మవారి విగ్రహం రూపంలో బయట పడతానని చెప్పారు.
అలాగే సరిగ్గా దసరా ఉత్సవాలు మొదటి రోజునే ఈ తవ్వకం చేయాలని పూనకం చెప్పినట్లు అశోక్ తెలిపాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి సూర్యచంద్రరావు ఇంటి ఆవరణలో తవ్వకం మొదటగా సరిగ్గా తొమ్మిది అడుగుల వెళ్లేసరికి అమ్మవారి విగ్రహం బయటపడింది. ఉదయం ఆరు గంటలకు విగ్రహం బయటకు బయటకు తీశారు.
ఈ విషయం ఆనోటా ఈనోటా గ్రామంలో వ్యాపించింది. దీంతో పరిసర ప్రాంత భక్తులు మండలంలోని పలు గ్రామాల వాసులు తండోపతండాలుగా అమ్మవారిని దర్శించేందుకు క్యూ కట్టారు. భక్తులు దర్శనం చేసుకుని విశేష పూజలు చేస్తున్నారు. దసరా ఉత్సవాలు ప్రారంభం కావటం, సరిగ్గా అదే రోజు ఈ ప్రాంతంలో అమ్మవారి విగ్రహం బయటపడటంతో ఈ ప్రాంత వాసులు పండుగల విశేష పూజలు చేస్తున్నారు.