ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్‌ కొనుగోళ్లకు అనుమతి..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 11:15 AM

లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్‌వోసి) రాష్ట్రప్రభుత్వం ఇవ్వడంతో కేంద్రప్రభుత్వం విద్యుత్‌ కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. ముందస్తుగా నగదు చెల్లించలేదని కెఎస్‌కె అనే ప్రైవేట్‌ కంపెనీ ఫిర్యాదు చేయడంతో రాష్ట్రానికి చెందిన విద్యుత్‌ సంస్థలను కేంద్రప్రభుత్వం బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అవసరాలకు తగ్గట్టుగా పవర్‌ ఎక్సైంజ్‌లో రాష్ట్రం విద్యుత్‌ కొనుగోలు చేసుకునేందుకు వీలు లేకుండా కేంద్రం చేసింది. రాష్ట్రప్రభుత్వం నగదు జమచేయడంతో కొనుగోళ్లకు అనుమతి ఇస్తున్నట్లు సోమవారం సదరన్‌ రీజనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఎస్‌ఆర్‌ఎల్‌డిసి) వెబ్‌సైట్‌లో పేర్కొంది. కెఎస్‌కె థర్మల్‌ కేంద్రానికి రూ.120 కోట్లు రాష్ట్రప్రభుత్వం సోమవారం చెల్లించడంతో ఎక్సెంజ్‌లో రాష్ట్ర డిస్కంలు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాయి. దీంతో శని, ఆదివారాలతో పోల్చుకుంటే సోమవారం రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు కూడా తగ్గాయి. ఆదివారం 6879 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉండగా అందుబాటులో 6670 మెగావాట్లు ఉంది. 200 మెగావాట్లు లోటు ఉంది. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం డిమాండ్‌ పెరిగింది. 7,200 మెగవాట్ల అవసరం కాగా అందుబాటులో 6,940 మెగావాట్లు ఉంది. 900 మెగావాట్ల లోటు ఉండగా, పవర్‌ ఎక్సెంజ్‌లో 680 నుంచి 1450 మెగావాట్లను డిస్కంలు కొనుగోలు చేశాయి. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం జెన్‌కో ఉత్పత్తి తగ్గింది. ఆదివారం 2,777 మెగావాట్ల ఉత్పిత్తి కాగా, సోమవారం 2,550 మెగావాట్లే ఉత్పిత్తి జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com