కర్నూల్ జిల్లా, కౌతాళం మండలం చిరుతపల్లి గ్రామానికి చెందిన వివాహిత గోవిందమ్మ మంగళవారం కడుపునొప్పి భరించలేక ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న భర్త అళ్లయ్య, తండ్రి అంజినయ్య, కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. గోవిందమ్మ ప్రస్తుతం రెండు నెలల గర్భిణీ. బాధితురాలు ఫిర్యాదు మేరకు కౌతాళం పోలీసులకు సమాచారం అందజేశామని ఔటపోస్టు కానిస్టేబుల్ రవీంద్రబాబు తెలిపారు.