వేంపల్లె మండల కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.వేంపల్లె సమీపంలోని గండికి వెళ్లే దారిలో ఉన్న మాల వంక తో పాటు.నాగూరు, కత్తులూరు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.నాగూరు, అయ్యవారుపల్లి గ్రామాల మధ్యలో ఉన్న వంక ఉద్ధృతంగా ప్రవహించడంతో.మూడు గ్రామాలకు కొద్ది సేపు రాకపోకలు నిలిచిపోయాయి.అలాగే చక్రాయపేట మండల కేంద్రంలోని కే. రాచపల్లి వంక ఉద్ధృతంగా ప్రవహించడంతో.. అక్కడ కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి..వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహించడంతో రైతుల కళ్లల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.