మహారాష్ట్ర ధూలేలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎనిమిది మంది మృతి చెందగా 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండగా ఆసుపత్రికి తరలించారు. పరిశ్రమలో సిలిండర్ల పేలుడు వలన ఈ ప్రమాదం జరగగా పేలుడు సమయంలో పరిశ్రమలో వంద మంది శ్రామికులున్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.