సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తూ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ) యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. విమానసంస్థ ఖర్చులు తగ్గించేందుకు పాక్ ఎయిర్లైన్స్ మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ప్రధానికి ఆర్థికసలహాదారుగా ఉన్న డాక్టర్ అబ్దుల్ హఫీజ్ షేక్తో ఉద్యోగుల తొలగింపు విషయాన్ని పీఐఏ సీఈవో ఎయిర్ మార్షల్ అర్షద్ మాలిక్ తెలిపారు. నిర్వహణ ఖర్చులు తగ్గించి.. ఆదాయ మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని పాక్ ఎయిర్లైన్స్కు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. ఖర్చులు తగ్గించే నేపథ్యంలోనే సుమారు వెయ్యి మంది అదనపు సిబ్బందిని తొలగించినట్లు ఎయిర్లైన్స్ సీఈవో మాలిక్ తెలిపారు.