ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలకలం రేపిన వానరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2019, 03:44 PM

జార్ఖండ్‌లోని జాదూగోడా పరిధిలోని రాఖామాండ్సా రైల్వే‌స్టేషన్‌లోకి చొరబడిన ఒక వానరం కలకలం సృష్టించింది. మధ్యాహ్నం 2 గంటలకు స్టేషన్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఆ వానరం సుమారు 2 గంటలపాటు అక్కడి సిబ్బందిని హడలెత్తించింది. ఆ వానరం ఏకంగా ప్యానల్ బోర్డుపై కూర్చొని సిబ్బంది కార్యకలాపాలకు అడ్డుతగిలింది. వానర చేష్టలకు భయపడి కొంతమంది పారిపోయారు. మరోవైపు ఆ సమయంలో అటువైపుగా రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదమేదీ జరగలేదు. సిగ్నలింగ్ వ్యవస్థను పర్యవేక్షించే ఉద్యోగి కూడా వానరానికి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. కాగా ఈ విషయమై స్టేషన్ అధికారి మోనామీ సింగ్ మాట్లాడుతూ వానరం కార్యాలయంలోకి ప్రవేశించి గందరగోళం సృష్టించడంతో సిబ్బంది భయపడిపోయారని అన్నారు. రెండు గంటల తరువాత అది అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com