సేవా భావంతో స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేసేందుకు వస్తున్న గ్రామ వాలంటీర్లు లో కష్టపడే తత్వం, నైపుణ్యాల ఆధారంగా భవిష్యత్తులో వీరిని నాయకులుగా ప్రోత్సహిస్తామని స్వయంగా సీఎం జగన్ ప్రకటించినప్పటికీ తమకు ఇస్తున్న గౌరవ వేతనంతో పోలిస్తే అప్పగించిన విధులు ఎక్కువంటూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 వేల మంది వాలంటీర్లు విధుల్లో చేరకుండా మిన్నకుండి పోయినట్టు తెలుస్తోంది. ఓ వైపు వలనతీరుగా పని చేస్తూ మరో వైపు వేరే పనితో కుటుంబ పోషణ నెట్టుకు రావచ్చన్న భావనలో ఉన్నవారిని ఎంపిక చేయొద్దని ప్రకటించిన నేపథ్యంలో చాలామంది ఇంటర్వ్యూ లకు కూడా హాజరు కాలేదు. అలాగే రేషన్ సరుకులు ఇంటింటికీ చేరవేయడాన్ని నామోషీగా భావిస్తుండటం, ఇంత చదువు చదువుకునీ రేషన్ సరుకులు మోసుకోవాలా అన్న భావన వ్యక్తం కావడంతో వేల సంఖ్యలో ఎంపికైన వాలంటీర్లు విధులకు దూరమయ్యారన్నా భావన వినిపిస్తోంది. దీంతో విధులలో చేరని వారి స్థానంలో రాతపరీక్షల్లో వారి కంటే తక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని సమాచారం.