మంగళవారం జరిగిన విశ్వాసపరీక్షలో ఓటమి పాలైన కర్ణాటక ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసారు. సిఎం కుమారస్వామి చేసిన రాజీనామాను గవర్నర్ వాజుభాయ్ వాలా ఆమోదించారు. అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో 99-105 తేడాతో కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు పరాజయం పాలైన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ ఆపధ్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. కాగా ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో విశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేసిన బిజేపి ప్రభుత్వ ఏర్పాటుకు రడీ అవుతోంది.