అమరావతి: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వాలంటీర్ల విధానంపై ఆయన గవర్నర్కు లేఖ రాశారు. గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియపై ప్రతిభ ఆధారంగా గ్రామ వాలంటీర్లను ఎంపిక చేయాలని లేఖలో కోరారు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్హత ఆధారంగా వెయిటేజీ ఇవ్వాలని సూచించారు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తే ఆందోళనకు దిగుతామని రఘువీరారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.