ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మనోజ్ కుమార్కు మూడు నెలల జైలుశిక్ష పడింది. ఎంపీ-ఎమ్మెల్యే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. 2103 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కల్యాణ్పురిలోని ఓ పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యే మనోజ్ ఎన్నిక ప్రక్రియను అడ్డుకున్నారు. ఆ కేసులో అతనికి పదివేల జరిమానా కూడా విధించారు. ఇదే కేసులో మనోజ్ కుమార్కు బెయిల్ కూడా మంజూరీ చేశారు.