అక్టోబర్ 1నాటికి బెల్టుషాపులను పూర్తిగా ఎత్తివేయాలని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమరావతిలోని ప్రజావేదికలో రెండో రోజు కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం మాట్లాడుతూ సమాజానికి మంచి చేసే పనుల్లో ముందడుగు వేయాల్సిందేనన్నారు. జాతీయ రహదారుల వెంట మద్యం షాపులు మూసివేయాలన్నారు. డాబాల్లో లిక్కర్ అమ్మకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.