తన నేతృత్వంలో మరో 15 మంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరనున్నారంటూ వస్తున్న కథనాలపై స్పందించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మంగళవారం మధ్యాహ్నం ఉత్తర నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశమైన ఆయన న్నికల తర్వాత ఇప్పుడు చాలా సార్లు పార్టీ మారుతానంటూ కథనాలు వచ్చాయన్నారు. ఇప్పుడు కూడా కథనాలు వస్తూనే ఉన్నాయని ఇవి ఓ వర్గం ఆడుతున్న మైండ్ గేమ్ అని ఆ వార్తలకు రియాక్ట్ కానవసరం లేదన్నారు. స్నేహితులతో కలిసి తాను శ్రీలంక పర్యటనలో ఉన్నప్పుడు ఆటు నుంచి అటే ఢిల్లీ వెళ్లి బిజేపిలో చేరిపోతానంటూ అధికార పార్టీ మీడియాలో ప్రసారం చేసుకుంటున్నారని. తను పార్టీ మారే ప్రసక్తే లేదని.. ఆ అవసరం తనకు లేదని గంటా తేల్చి చెప్పారు.