విజయవాడ, సూర్య బ్యూరో : స్వచ్చభారత్ మిషన్లో భాగంగా జిల్లాలో టాటా ్టస్ట్రు సహకా రంతో ఏడువేలకు పైగా వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించినట్లు జిల్లా కలెక్టరు బాబు.ఎ. కేంద్ర స్వచ్చభారత్ మిషన్ ప్రభుత్వ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్కు వివరించారు. శుక్ర వారం సాయంత్రం కేంద్ర స్వచ్చభారత్ మిషన్ ప్రభుత్వ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ ఢిల్లీ నుండి దేశ వ్యాప్తంగా స్వచ్చభారత్ మిషన్ పై జిల్లా క ెక్టర్లు, ప్రత్యేక కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో టాటా ట్రస్టు సహకారంతో గ్రామా ల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు చేపడుతున్నామని కలెక్టరు వివరించారు. జిల్లా లోని గ్రామీణ ప్రాంతాల్లో టాటా ట్రస్టు సహకారంతో జరుగుతున్న స్వచ్చ భారత్ మిషన్ను ఆదర్శంగా తీసుకొని దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాకు టాటా ్టస్ట్రు నుండి ఒక ప్రతినిధిని నియామకం చేయనున్నట్లు కేంద్ర స్వచ్చభారత్ మిషన్ ప్రభుత్వ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ వీడియో కాన్పరెన్స్లో తెలిపారు. దీనిలో భాగంగా కష్ణాజిల్లాకు కూడా టాటా ట్రస్టు ప్రతినిధిని నియమించ నున్నట్లు తెలిపారు. వీరికి ఈ నెల 23 నుండి 25 వరకు ఢిల్లీలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర స్వచ్చభారత్ మిషన్ ప్రభుత్వ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ తెలిపారు. వీడియో కాన్పరెన్స్లో సబ్ కలెక్టరు డి. బాలాజీ, ఆర్ డబ్ల్యూ ఎస్.ఇ. శ్రీనివాసరావు, స్టేట్ స్వచ్చభారత్ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టరు రవీంధ్రనాధ్, టాటా ట్రస్టు ప్రతినిధి వివేన్ తదితరులు పాల్గొన్నారు.